శంఖవరం మండలం సీతంపేటలో జనసేన గ్రామకమిటీ నియామకం

ప్రత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో శంఖవరం మండలం సీతంపేట గ్రామంలో జనసేన సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామకమిటీ వేయడం జరిగింది. సీతంపేట గ్రామకమిటీ జనసేన పార్టీ అధ్యక్షులుగా కొయ్య మోహన్, గ్రామకమిటీ జనసేన పార్టీ ఉపాధ్యక్షులుగా తాటిపర్తి జయరాజ్, sk. మీరా, గ్రామకమిటీ ప్రధాన కార్యదర్శులుగా కొయ్య దుర్గాప్రసాద్, సెక్రటరీ కొయ్య స్వామి లను ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో శంఖవరం మండల అధ్యక్షులు సుభాష్, శంకవరం రౌతులపూడి మండలం కన్వీనర్ కరణం సుబ్రహ్మణ్యం, జిల్లా కార్యదర్శి శేషారావు, ఏలేశ్వరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పెంటకోట మోహన్, ఇతర జనసైనికులు అందరూ పాల్గొన్నారు.