గురజాల పట్టణంలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని కమిషనర్ కి వినతిపత్రం ఇచ్చిన జనసేన

గురజాల నగర పంచాయతీ పరిధిలోని గురజాల పట్టణంలో గల చిన్న మసీదు సెంటర్, కన్యకా పరమేశ్వరి ఆలయం, గాంధీ బొమ్మ సెంటర్, మాచర్ల రోడ్, పలు ప్రధాన ప్రదేశాలలో, చెత్త కుండీలను ఏర్పాటు చెయ్యాలని, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి కటికం అంకారావు నాయకులు ప్రసాద్, అజీస్, మణి నగర పంచాయతీ కమిషనర్ ని కలిసి, వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా అంకారావు మాట్లాడుతూ, ప్రధాన ప్రదేశాలలో చెత్తను వేయటం ద్వారా,అక్కడ నివసించే, ప్రజలు అనారోగ్యానికి గురి అవుతున్నారని ఆయన అన్నారు. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయటం ద్వారా, అంటూ వ్యాధులు కూడా సోకే ప్రమాదం ఉందని, ఆయన తెలియజేసారు. ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకొని, వెంటనే ప్రధాన ప్రదేశాలలో చెత్త కుండీలను ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించాలని, ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాగేంద్రబాబు, చిన్ని, వెంకటేష్, రాజేష్, తదితర జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.