జనసేన మిషన్ 3000 కార్యక్రమం

గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలంలో చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ మరియు ఇంచార్జ్ డా.యుగంధర్ పొన్న అన్న గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ నాయకులు పార్టీ బలోపేతం కోసం మిషన్ 3000 అనే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం పార్టీ బలోపేతం చేయడానికి పల్లెపల్లెకి వెళ్ళి జనసైనికులు ఎంత మంది ఉన్నారు అని సర్వే చేసి పార్టీలోకి తీసుకోవడం జరుగుతుంది. పార్టీ అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది. అదే విధంగా ప్రజల సమస్యలు గురించి తెలుసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం, అలాగే మండలంలో 3000 మంది జనసైనికులను తయారుచేయడం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమం కార్వేటినగరం మండలం గౌరవ అధ్యక్షులు గుర్రంకొండ భానుచంద్ర రెడ్డి చేపట్టుతున్నారు.