మడకశిర మండల అద్యక్షుడిగా టి.శివాజీ
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-11-at-5.51.42-PM-461x1024.jpeg)
అనంతపురం జిల్లా జనసేన పార్టీ జిల్లా అద్యక్షులు శ్రీ T.C వరుణ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి PAC సభ్యులు శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి అలాగే హిందూపురం పార్లమెంట్ ఇంచార్జ్ శ్రీ ఆకుల ఉమేష్ మడకశిర మండల అద్యక్షుడిగా ఎన్నికైనటువంటి శ్రీ టి.శివాజీ కి ప్రమాణా స్వీకార నియమాక పత్రాన్ని అందజేయడం జరిగింది. మడకశిర నియోజకవర్గంలోని నూతనంగా ఎన్నుకున్న మండల అధ్యక్షులతో చర్చిస్తూ రాబోవు రోజుల్లో మడకశిర నియోజకవర్గంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి మండల అధ్యక్షుడు కృషి చేయవలసిందిగా అంతేకాకుండా త్వరలో వచ్చే మండల కమిటీలోనూ ముందునుంచి పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్క కార్యకర్తకు అవకాశం ఇవ్వాలని… ప్రస్తుతం నెలకొన్న దుర్మార్గమైన ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ తీరును ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి రాబోవు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడే శ్రీ జనసేనాని పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసేంతవరకు మనమందరం కలిసి కృషి చేద్దామని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.