పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకోటమే మన లక్ష్యం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం

జగ్గయ్యపేట నియోజకవర్గం, పెనుగంచిప్రోలు మండలంలోని స్థానిక కె వి ఆర్ గార్డెన్స్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట నియోజకవర్గ ఆత్మీయ సమావేశం నిర్వహించటం జరిగింది. ఈ కార్యరమనికి ముఖ్య అతిధిగా కృష్ణ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ మాట్లాడుతూ జనసైనికులు అందరూ కలిసికట్టుగా జనసేన పార్టీ సిద్ధాంతాలను జనంలోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని తెలిపారు. జిల్లా సంయుక్త కార్యదర్శి ఈమని కిషోర్ కుమార్ మాట్లాడుతూ కొత్తగా నియమించబడిన మండల అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపి కార్యకర్తలు లేనిదే నాయకులు లేరని పార్టీలో జనసైనికులకు తగిన గుర్తింపు ఇవ్వాలని తెలిపారు. ప్రధాన కార్యదర్శి బడిసా మురళికృష్ణ మాట్లాడుతూ కలిసి అందర్నీ కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉరిమి సర్పంచ్ పంచకర్ల సురేష్, మండల అధ్యక్షులు బ్రహ్మం, శివ, రామయ్య, IT వింగ్ హరికృష్ణ, షౌకత్ అలీ, జనసైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.