సంక్రాంతి రోజు కిడ్నీ పేషెంట్ కి రాజంపేట జనసైనికుల సాయం

కడప జిల్లా రాజంపేట తాలుకా అత్తిరాల గ్రామంలో ఒక నిరుపేద కుటుంబానికి జనసేన పార్టీ తరుపున సహాయం చేయడం జరిగింది. కిడ్నీ సమస్యతో గత 4 సంవత్సరాలుగా బాధపడుతున్న పాచికర్ల రావణయ్య డయాలిసిస్ చేయిన్చుకోలేక అష్టకష్టాలు పడుతుంటే జనసేన కార్యకర్తలు మంచి మనుసుతో ముందుకు ముందుకు వచ్చి డయాలిసిస్ ఖర్చులకు సహాయం చేసారు. అలాగే రాజంపేటలో తక్షణమే డయాలిసిస్ సెంటర్ ఓపెన్ చేసి పేద ప్రజలని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు భారతాల ప్రశాంత్, తాళ్ళపాక శంకరయ్య, మిరియం నాని, శ్రీను, గంగాధర మరియు అత్తిరాల జనసేన కార్యకర్తలు.