గోవింద రాజుపురంలో 30 కుటుంబాలు జనసేనలో చేరిక

నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం నందు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం గోవిందరాజు పురం గ్రామానికి చెందిన 30 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు ప్రజా సమస్యలపై నిరంతరం అలుపెరుగని పోరాటం చేస్తూ భావితరాల భవిష్యత్ కోసం కుల మత వర్గ భేదాలు లేని వ్యవస్థని నిర్మించడం కోసం ఆయన వేసే ప్రతి అడుగులో చేసే ప్రతి పోరాటంలో అండగా పవన్ కళ్యాణ్ ఆశయ సాధన అడుగుజాడల్లో నడుస్తామని చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది అదేవిధంగా 2024 గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కూడా పోరాడుదాం పార్టీని వార్డు స్థాయి గ్రామస్థాయి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పని చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున్, సందీప్, హరి, దయాకర్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.