గుత్తి మండలం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-26-at-8.55.04-PM-1024x589.jpeg)
గుంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గుత్తి మండల అధ్యక్షుడు పోతురాజు చిన్న వెంకటేశ్వర్లు అధ్యక్షతన మండల కమిటీ ఏర్పాటు మరియు జనసేన పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా నిస్వార్థంగా కష్టపడే నిస్వార్థ జనసైనికులకు పార్టీ కార్యవర్గ కమిటీలో పెద్దపీట వేయడం జరుగుతుంది, రాబోయే రోజుల్లో కమిటీ సభ్యులందరూ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించి ఆ సమస్యల పరిష్కారం దిశగా ప్రజాక్షేత్రంలో జనసైనికులు అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతూ రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ విజయం సాధించడానికి అహర్నిశలు పాటుపడాలని పేర్కొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-26-at-8.55.04-PM-1-1024x461.jpeg)