మిషన్ 3000 కార్యక్రమంలో భాగంగా జనసైనికుల కోసం జనసేన
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/01/WhatsApp-Image-2022-01-28-at-9.30.06-PM-1024x461.jpeg)
గంగాధర నెల్లూరు నియోజకవర్గం జనసేన ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న సూచనల మేరకు జనసైనికుల కోసం జనసేన కార్యక్రమాన్ని కత్తెర పల్లి పంచాయతీ నందు సర్వే చేయడం జరిగింది. కత్తెరపల్లి గ్రామం, కత్తెరపల్లి బీసీ కాలనీ, కత్తెరపల్లి ఏఏడబ్ల్యు, కత్తెరపల్లి హెచ్.డబ్ల్యు గ్రామాలలో జనసైనికులు కలిసి పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తూ పార్టీతో కలిసి నడవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమం కార్వేటినగరం మండల అధ్యక్షులు శోభన్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పి వెంకటేష్, భగత్సింగ్ స్టూడెంట్ యూనియన్ లీడర్ సాయి కుమార్, కత్తెరపల్లి పంచాయతీ యూత్ లీడర్ చక్రి పాల్గొనడం జరిగింది.