మహాత్మా గాంధీ వర్ధంతికి నివాళులర్పించిన రైల్వేకోడూరు జనసేన

రైల్వేకోడూరు పట్టణంలోని స్థానిక టోల్ గేట్ సర్కిల్ వద్ద గల మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు రైల్వేకోడూరు జనసేన పార్టీ నాయకులు గంధంశెట్టి దినకర్ బాబు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా దినకర్ బాబు మాట్లాడుతూ అహింసా మార్గంలో స్వాతంత్ర హక్కులను , శాంతియుత పోరాటాన్ని నేర్పిన గాంధీ అడుగుజాడలు భారతదేశానికి చిరస్మరణీయం అన్నారు. ఈ కార్యక్రమంలో వై. కోట జనసేన యూత్ మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.