మార్కాపురం జిల్లా సాధన సమితి ర్యాలీకి మద్దతుగా జనసేన

ప్రకాశం జిల్లా, పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం ప్రత్యేక జిల్లా చేయాలని నినాదంతో మార్కాపురం జిల్లా సాధన సమితి తలపెట్టిన ర్యాలీకి మద్దతుగా జనసేన పార్టీ ఇమ్మడి కాశీనాధ్ సోమవారం మార్కాపురం పట్టణంలోని స్థానిక ఎల్ఐసి సెంటర్ నుంచి ర్యాలీగా మొదలైన ఆర్డిఓ ఆఫీస్ కార్యాలయం వరకు సాగిన ఈ ర్యాలీకి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ, ప్రజలు తాము సైతం ఈ ర్యాలీకి బాసటగా నిలుస్తామని ప్రజా నాయకుడు ఇమ్మడి కాశీనాధ్ వెంట నడుస్తూ ప్రత్యేక జిల్లా కావాలని నినదిస్తూ, నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రజా నాయకుడు ఇమ్మడి కాశీనాధ్ వెంట నడిచేందుకు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యవర్గం మొత్తం మార్కాపురం తరలి వచ్చి తమ నాయకుడు ఇమ్మడి కాశీనాధ్ తోనే తమ ప్రయాణం అని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, మార్కాపురం టౌన్ అధ్యక్షుడు షేక్ ఇమామ్ సాహెబ్ , మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, తర్లుపాడు మండల అధ్యక్షుడు చేతుల శ్రీనివాసులు, ఉపాధ్యక్షురాలు సూరే సువర్ణ, జనసేన నాయకులు గుంటూ రత్నాకర్, పిన్నెబోయిన శ్రీనివాస్, పూజ లక్ష్మి, శిరిగిరి శ్రీనివాస్, షేక్ నూర్జహాన్, కురంగి యోగయ్య, నరసింహ, జానకిరామ్ సింగ్, పోటు వెంకటేశ్వర్లు, ఖాజావలి, తిరుమలశెట్టి మధు, చందు దేవెండ్ల, శ్రీను, వెలిగొండ రాయుడు, నాగరాజు, దుర్గ, వేంకటేశ్వర్లు, పిచ్చయ్య మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.