ప్రమాదంలో గాయపడిన జనసైనికులను పరామర్శించిన బత్తుల

  • ప్రమాదంలో గాయపడిన జనసైనికులను వారి కుటుంబాలను పలకరించి మనోదైర్యం చెప్పిన జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: ఇనుగంటివారిపేట గ్రామానికి చెందిన కలిదిండి వంశీ ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కి గురై రాజమండ్రి అపెక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని, వారి కుటుంబ సభ్యులను పలకరించి ఆరోగ్య పరిస్థతి అడిగి తెలుసుకొని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 5000/- రూపాయలు ఆర్థిక సాయం అందించారు.
అదేవిధంగా సీతానగరం మండలం లంకూరు గ్రామానికి చెందిన మనేల త్రిమూర్తులు అనారోగ్యానికి గురై రాజమండ్రి హరిత ఆసుపత్రిలో చికత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రాజానగరం జనసేన నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారిని, వారి కుటుంబ సభ్యులను పలకరించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకొని వారికి వైద్య ఖర్చుల నిమిత్తం 5000/- రూపాయిలు ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల జనసేన నాయకులు మట్ట వెంకటేశ్వరరావు, కొండాటి సత్యనారాయణ, పెంటపాటి శివ, దార్ల బ్రహ్మం, వర్రే ఈశ్వర్, ఆలపాటి ఎల్లార్ కుమార్, చిక్కాల సన్ని, చొంగ దుర్గాప్రసాద్, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.