మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేయాలని డిమాండ్ చేస్తూ భారీ బ్యానర్ తో ర్యాలీ

మదనపల్లె జిల్లా సాధన జేఏసి మరియు జనసేన అద్వర్యంలో మదనపల్లి బెంగళూరు బస్టాండ్ నుండి మదనపల్లి మున్సిపాలిటీ, సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు 130 అడుగుల పొడవు గల బ్యానర్ తో మానవహారం లాగ జరిగిన ర్యాలీగా బెంగళూరు బస్టాండ్ నుండీ మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరకు వెళ్లి వినతిపత్రం ఇవ్వడం జరిగింది, మరియు అక్కడ నుండి కలెక్టర్ ఆఫీసు వెళ్లి కలెక్టర్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. రాయలసీమ కో-కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, మదనపల్లి జనసేన నాయకులు శేఖర్, శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, కృష్ణమూర్తి, భాగ్యరాజా, రెడ్డి, అంజలి, శంకర, శివరామ్, కళ్యాణ్, నవీన్, సతీష్ గజ్జల రెడ్డెప్ప సనావుల్లా ఫాజిల్, వీరమహిళ పద్మ అఖిలపక్ష నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.