కావాలి అరకు జిల్లా.. ప్రకటించాలి అరకు జిల్లా: మాదాల శ్రీరాములు
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/02/WhatsApp-Image-2022-02-01-at-6.24.30-PM.jpeg)
అరకు నియోజకవర్గం రాష్ట్రంలో కొత్త జిల్లాలగా ప్రకటించడం స్వాగతిస్తున్నాం. కొత్తగా ప్రకటన చేసిన జిల్లాల్లో పాడేరుకి జిల్లా ప్రకటించడం చాలా అన్యాయం మేము రాష్ట్ర ప్రభుత్వానికి మాకు జిల్లా ఇమ్మని అడిగామా..? మెడికల్ కాలేజ్ ఇవ్వండి అని అడిగామా..? గిరిజన యూనివర్శిటీ ఇమ్మని ఆడిగమా..? పార్లమెంట్ ని జిల్లా కేంద్రంగా ప్రకటిస్తామని చెప్పింది. ప్రభుత్వం గిరిజన యూనివర్శిటీ మెడికల్ కాలేజ్ ఇస్తామని ఆశలు పెట్టింది, నేడు దేశంలో జనగణ మన పూర్తి అవకుండా జిల్లాలు ప్రకటించే అవకాశం లేకపోయినా నేడు ప్రకటించారు. మొదట అరకు జిల్లా కేంద్రంగా ప్రకటించి నేడు పాడేరు ప్రకటించడం పై సర్వత్రా విమర్శలకు గురవుతుంది. హడావిడిగా పాడేరుకు మెడికల్ కాలేజ్ , జిల్లాగా ప్రకటించి అరకు కు అన్యాయం చేశారని జనసేనపార్టీ పార్లమెంట్ అధికారప్రతినిధి మాదాల శ్రీరాములు తెలిపారు. ఈ సందర్భము ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అరకు కు అన్యాయం జరిగింది. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి వర్యులు వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట తప్పి అరకులోయ ను అన్యాయం చేసారు. ప్రకటించడం దేనికి, జిల్లా కేంద్రం మార్చడం దేనికి. ప్రభుత్వానికి చిత్త శుద్ధిలేదు రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతో నాటకాలాడుతుంది ప్రభుత్వం వెంటనే అరకునే జిల్లా కేంద్రం ప్రకటించాలి లేని పక్షాన ప్రజాసంఘాల తో కలిసి అరకు లోయకు జిల్లా ప్రకటించే వరకు ఉద్యమం ఉదృతం చేస్తాం. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తాం ఇప్పటికైనా అరకు ఎమ్మెల్యే స్పందించాలి. ఉద్యోగస్తులు, విద్యార్థులు, రైతులు, పార్టీలు, రాజకీయనాయకులు, ప్రజాసంఘాలు అందరు ఏకమై జిల్లా సాధించే వరకు పోరాటంలో పాల్గొవాలాని ఈ సందర్భముగా తెలిపారు .అరకు కు జిల్లా ప్రకటించే వరకు మా పోరాటం ఆగదని జనసేనపార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ కొనెడి లక్ష్మణ్ రావు, డుంబ్రిగుడా మండల నాయకులు బంగురు రామదాసు, అరకు మండల నాయకులు అల్లంగి రామకృష్ణ, డుంబ్రిగుడా నాయకులు కొనెడి చినబాబు రాజు పాల్గొన్నారు.