రైతు సమస్యలను ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చిన పేడాడ రామ్మోహన్ రావు

ఆమదాలవలస నియోజకవర్గం సరుబుజ్జిలి మండలం పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తెలుసుకున్న నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు బుడ్డివలస గ్రామానికి చెందిన కొంత మంది రైతులను కలిసి ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై మాట్లాడి తెలుసుకున్నారు. ఇదే విషయంపై సరుబుజ్జిలి మండల ఆఫీస్ లో రైతుల అందరి సమక్షంలో ఎమ్మార్వో దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సరుబుజ్జిలి మండల జెడ్పీటీసీ అభ్యర్ధి పైడి మురళీ మోహన్, బుడ్డివలస గ్రామ రైతులు తులగాపు ఢిల్లీ రావు, కొరపాపు గణేష్, సురవరపు గోపి, కిరణ్ గ్రామ నాయకులు తులగాపు ధనుంజయరావు, పెద్దింటి సింహాచలం, అంపిలి గోవిందరావు, బురాడ కంచన్ నాయుడు, వాడవలస బాలాజీ, వాడవలస నాగరాజు, పెద్దింటి భూలోకం తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.