పద్మశ్రీ మొగులయ్యని మర్యాదపూర్వకంగా కలిసిన నేమూరి శంకర్ గౌడ్

అనాది గొంతుకు అపురూపమైన స్పందన తెలంగాణ జాతిరత్నం మొగులయ్యని వారి స్వగ్రామం అయినటువంటి అవుసలీకుంట, అచ్చంపేట నియోజకవర్గం, నాగర్ కర్నూల్ జిల్లాకు వెళ్లి మర్యాదపూర్వకంగా స్వయంగా కలిసినటువంటి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ జనసేన జిల్లా ముఖ్య నాయకులు, కార్యకర్తలు. అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం లో ముఖ్య అతిథిగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ మరియు జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ లక్ష్మణ్ గౌడ్ పాల్గొని జనసేన నాయకులకు మరియు జనసైనుకులకు దిశా నిర్దేశం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి విభాగం సెక్రటరీ ముకురాల కృష్ణ, జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబెర్ జానీ ,జనసేన పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థి విభాగం కో-ఆర్డినేటర్ శరత్ గౌడ్, పాలమూరు నియోజకవర్గ నాయకులు పి.ఆర్.రాఘవేంద్ర, వనపర్తి జిల్లా, నియోజకవర్గ నాయకులు ముకుంద నాయుడు, ఎమ్ రెడ్డి రాకేష్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నాయకులు కురుమన్న, బారిగారి రాజేందర్, కోడిగంటి సాయి, సూర్య, రాజు నాయక్, రాజేష్ గౌడ్, లింగం నాయక్, రమేష్, సర్వర్, అన్వేష్ రెడ్డి, లక్ష్మీ నారాయణ, కళ్యాణ్ గిరి, శ్రీకాంత్, శివ, గౌరవ్, వెంకటేష్, రోహిత్, శివ తదితరులు పాల్గొన్నారు.