నర్సిపురం గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

పార్వతీపురం నియోజకవర్గం, నర్సిపురం గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. నర్సిపురం జనసైనికుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగ సభ్యులు గేదెల సతీష్ మరియు జనసేన నాయకులు, వీరమహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సిపురం గ్రామ యువత ఎంతో కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయ్యడం వలన జనసేన నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేసారు.