64వ వార్డులో మంచినీళ్ల బోరు బాగుచేయించిన జనసేన కార్పొరేటర్

గాజువాక నియోజకవర్గం, 64వ వార్డు గంగవరం గ్రామం, ఉమ్మిడి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాలా రోజుల నుండి మంచినీళ్ల బోరు మూతపడిందిని వీధిలో మహిళలు నీళ్ల కోసం ఇబ్బంది పడుతున్నారని 64వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి కి ఫిర్యాదు చేశారు. గోవింద్ రెడ్డి వెంటనే స్పందిస్తూ.. కేవలం 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించే విధంగా పని పూర్తి చేయించడం జరిగింది. ఆ వీధిలో మహిళలు గోవింద్ రెడ్డి కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు. గంగవరం గ్రామ జనసేన కార్యకర్తలను అభినందించారు. ఈ కార్యక్రమంలో అప్పారావు, రథము, బాపనయ్య, జనసేన నాయకులు మెగా నూకరాజు, జనసేన పార్టీ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.