రాజ్యాంగ నిర్మాతకు ఘననివాళి

ఉమ్మడి కరీంనగర్ జిల్లా, డా.బాబా సాహెబ్ అంబేద్కర్ 132 వ జయంతి కార్యక్రమం ఒద్యారం గ్రామంలోని స్థానిక అంబేద్కర్ భవన్ లో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులు పండుగ గగన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తదనంతరం స్థానిక పిల్లల చేత కేక్ కట్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గగన్ కుమార్ గారు మాట్లాడుతూ మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విద్యావేత్తగా, రాజ్యాంగ నిర్మాణ సారదిగా, న్యాయ శాఖ మంత్రిగా మన దేశానికి ఎనలేని సేవలు చేశారని గుర్తు చేశారు. ఆయనకు నిజమైన నివాళి కులవివక్ష విడనాడినప్పుడే అని, అస్పృశ్యత, అంటరానితనం నిర్మూలనకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. జయంతులకు, వర్ధంతులకి మాత్రమే కాకుండా సంవత్సరంలో 365 రోజులు మహనీయుడు అంబేడ్కర్ చేసిన సేవలు గుర్తుంచుకొని ఆయన సూచించిన అడుగుజాడల్లో నడిచినప్పుడే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ విద్యార్థి విభాగ నాయకులు సావనపెళ్లి ప్రేమ్ కుమార్, శివ కుమార్, సీనియర్ నాయకులు సావనపెళ్ళి ప్రశాంత్ మరియు ములుకుంట్ల కరుణాకర్, సావనపెళ్లి స్వామి, వంశీ, అనిల్,స్థానిక బీఎస్పీ నాయకులు గర్షకుర్తి సెక్టార్ అధ్యక్షులు గొట్టుముక్కల రాజు పాల్గొన్నారు.