ధోనిముక్కలలో వసతులతో కూడిన వైకుంఠధామం ఏర్పాటుచేయాలని వినతి

*గుంతకల్ మండలం ధోనిముక్కల గ్రామంలో అన్ని వసతులతో కూడిన వైకుంఠధామం(స్మశాన వాటిక) ఏర్పాటు చేయాలని కోరుతూ తాసిల్దార్ గారికి వినతి – అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, గుంతకల్ మండల జనసేన అధ్యక్షుడు కురువ పురుషోత్తం

గుంతకల్, జనసేన నాయకులు ఎమ్మార్వో గారితో మాట్లాడుతూ గుంతకల్ మండలం ధోని ముక్కల గ్రామంలో జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఈ గ్రామానికి ఉన్నటువంటి వైకుంఠధామం(స్మశాన వాటిక) యొక్క స్థలము జాతీయ రహదారి నిర్మాణంలోకి కొంతభాగం వెళ్ళింది. దీనివలన స్మశాన వాటిక చిన్నదవడంతో స్థానిక గ్రామస్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. కావున కొంతభాగం ప్రభుత్వ భూమిని స్మశాన వాటిక కేటాయించి దానికి చుట్టూ కాంపౌండ్ వాల్, బోరు, వాటర్ ట్యాంకు, రోడ్డును ఏర్పాటు చేసి గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ గుంతకల్ మండల శాఖ తరపున విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నిస్వార్థ జనసైనికులు, జనసేన నాయకులు 13 వార్డ్ ఇంచార్జ్ బండి శేఖర్, ధోనిముక్కల రాజశేఖర్, కసాపురం సుబ్బయ్య, ఎస్ కృష్ణ, పాండు కుమార్, అల్లు రవి తదితరులు పాల్గొన్నారు.