విలేకరులపై దాడి చేయడం గర్హమైన చర్య: మందపాటి దుర్గారావు

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణ వాసి గోపిశెట్టి మల్లీశ్వరి మహాన్యూస్ రిపోర్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు గురిచేస్తున్న నిష్పక్షపాతంగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెస్తున్నారు. ఆడవారు ఈ వృత్తిలో కోసాగడం చాలా కష్టం కానీ మొక్కవోని ధైర్యంతో జర్నలిస్ట్ గా ముందుకుసాగుతు నిజాన్ని నిర్భయంగా బయట ప్రపంచానికి చాటుతున్నారు. ఈ క్రమంలోనే కొంత మంది దుండగులు నిన్న రాత్రి మల్లేశ్వరికి చెందిన ద్విచక్రవాహనం స్కూటీ పై పెట్రోల్ పోసి నిప్పంటించి వాహనాన్ని దగ్ధం చేశారు. ద్విచక్రవాహనం పూర్తిగా దగ్దమయ్యింది. ఇటువంటి కక్షపూరితమైన చర్యలని తీవ్రంగా ఖండిస్తున్నామని దీనిపై పూర్తి విచారణ చేసి దుండగుల పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు వారిని కోరుతున్నామని ఆమెకి రక్షణ కల్పించవలసిందిగా జనసేనపార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని జనసేనపార్టీ దాచేపల్లి మండల అధ్యక్షులు మందపాటి దుర్గారావు అన్నారు.