శ్రీశ్రీశ్రీ కుక్కుటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మంగళవారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జనసైనికులు, నాయకులతో కలిసి పిఠాపురంలో శ్రీశ్రీశ్రీ ఉమా కుక్కుటేశ్వర స్వామి వారిని 10వ శక్తి పీఠం శ్రీ పురుహూతికా అమ్మవారిని దర్శించుకుని అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ… మా అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ పెద్దలు తెలుగు రాష్ట్ర ప్రజలు జనసైనికులు వీరమహిళలు సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుని అలాగే ప్రతి ఒక్కరికి శివయ్య దీవెనలు ఉండాలని పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రము, కాశీ విశ్వనాధుని క్షేత్రము, కోటిపల్లి శివ క్షేత్రం, దాక్షారామం భీమేశ్వర క్షేత్రం, శ్రీశైలం, మల్లికార్జున స్వామి క్షేత్రం, వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకునే, భక్తులు, మహిళలు, ప్రజలంతా దేవ దేవుని దివ్య ఆశీస్సులుతో సంతోషంగా వర్ధిల్లాలని ప్రజలు, జనసైనికులు, జిల్లా కార్యదర్శులు, నియోజకవర్గ ఇన్చార్జిలు అంతా క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో.. జనసేన పార్టీ నాయకులు పుణ్యమంతుల బాబురావు(మూర్తి), గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, కందరాడ ఎంపీటీసీ పిల్లా సునీత(పిల్ల దినేష్), బుర్రా సూర్య ప్రకాష్, చీకోలు రాజశేఖర్, మేళం బాబి, వేణుం, సురేష్, దేవా, రాము, నల్లడి ప్రసాద్, చిన్నారి, కంద సోమరాజు తదితరులు పాల్గొన్నారు.