క్రియాశీలక సభ్యత్వం జనసైనికులకు గొప్ప వరం: రాహుల్ సాగర్

ఎమ్మిగనూర్, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం పార్టీ కార్యకర్తలకు గొప్ప వరం అని జనసేన పార్టీ ఎమ్మిగనూర్ నియోజకవర్గ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా రాహుల్ సాగర్ మాట్లాడుతూ… దేశ చరిత్రలో ఏ పార్టీ తన కార్యకర్తలకు ఇవ్వలేని భరోసా ఇచ్చిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. క్రియాశీలక సభ్యత్వం పొందిన ప్రతి ఒక్క కార్యకర్త పార్టీ గెలుపు కోసం అనునిత్యం కృషి చేయాలని రాబోయే ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో జనసేన జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.