రోడ్ల పరిస్థితిపై సర్కారు మొద్దునిద్ర వీడాలి: పాలవలస యశస్వి

*జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. మొద్దునిద్ర పోతున్న వై ఎస్ జగన్ ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు చేపట్టిన కార్యక్రమం #GoodMorningCMSir

*ఈ కార్యక్రమం మూడు రోజులపాటు జులై 15,16,17 తేదీలలో రాష్ట్రామఒతటా చేయటానికి జనసేన పార్టీ కార్యకర్తలు ఉద్యమిస్తున్నారు.

*ఆంధ్రప్రదేశ్ రహదారుల దుస్థితిని తెలియచేసేందుకు #GoodMorningCMSir హ్యాష్ ట్యాగ్ తో డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది.

దత్తిరాజేరు మండలం:ఆదివారం ఉదయం శ్రీమతి పాలవలస యశస్వి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదేశాలమేరకు.. గజపతినగరం నియోజకవర్గం, దత్తిరాజేరు మండలంలొ కార్యక్రమం గుడ్ మార్నింగ్ సీఎం సార్ ప్రారంభం చేయడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న రోడ్ల దుస్థితి పై నిరసన తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో గజపతినగరం నియోజకవర్గం నాయకులు మామిడి దుర్గాప్రసాద్, చరణ్, అప్పారావు సారికి మురళి, సింహాద్రి ప్రవీణ్, బొబ్బాది సూర్య, సలపు సంతు, పల్లి సత్యనారాయణ, బుడి పైడి నాయుడు రామచంద్రరావు పిట్టా పోలి నాయుడుజిల్లా నాయకులు రవిరాజ్ చౌదరి, ప్రసాద్, నియోజకవర్గం జనసైనికులు పాల్గొన్నారు.