సర్వేపల్లి నియోజకవర్గంలో విలేకరుల సమావేశం

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, సర్వేపల్లి జనసేన కార్యాలయం నందు నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ బాబు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. సర్వేపల్లి నియోజవర్గాన్ని నెల్లూరు జిల్లాలో ఉంచాము అని చెప్పి అధికార పార్టీ నాయకులు డబ్బా కొట్టుకుంటున్నారు. సర్వేపల్లి నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి పూలాభిషేకాలు, పాలాభిషేకాల మీద ఎక్కువ దృష్టి చూపిస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాట్లలో భాగంగా చిత్తూరు జిల్లాలో ఉన్న చంద్రగిరి బాలాజీ జిల్లా(తిరుపతి)లో ఉంది.. అలాగే నెల్లూరుకి ఆనుకొని సర్వేపల్లి నియోజకవర్గం ఉంది.. ఇందులో ప్రత్యేకత ఏముందో మాకు ఐతే తెలియడం లేదు. సర్వేపల్లిని నెల్లూరు జిల్లాలో ఉంచకపోతే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. బుధవారం నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ రంగంలో కొనసాగే థర్మల్ ప్లాంట్ ప్రవేటికరణను వ్యతిరేకిస్తూ భూములు ఇచ్చిన స్థానిక రైతులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చేస్తుంటే సర్వేపల్లి శాసన సబ్యులకు పట్టదా.. అదేవిధంగా పండించిన పంటకు గిట్టుబాటు ధరలేఖ రైతులు ఇబ్బందులు పడుతుంటే.. పండించిన పంటకు పుట్టికి(860 కే జి)కి 25000 వేల రూపాయలు గిట్టుబాటు ధర కేటాయించవలసిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే సర్వేపల్లి శాసన సబ్యులు ఆసంబ్లీలో ఉండీ రైతులు ప్రక్షాన ఎందుకు మాట్లాడలేక పోతున్నారు. దయచేసి నియోజకవర్గం మీద దృష్టి పెట్టండి సమస్యలు పరిష్కారించండి తర్వాత పాలాభిషేకం పూలాభిషేకం చేసుకోవచ్చు.
ఈ కార్యక్రమంలో పినిశెట్టి మల్లికార్జున, శివరాత్రి సందీప్, పాలపర్తి చరణ్, బొబ్బేపల్లి మల్లికార్జున, పిల్లల సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.