జనసైనికులు అందరికీ ఒక బహిరంగ విజ్ఞప్తి

రేపటి అథినాయకుడి ప్రసంగం అనేది మన పార్టీ భవిష్యత్తునే కాదు, రాష్ట్ర భవిష్యత్తుని కూడా సంపూర్ణంగా మార్పు చేయగలిగిన శక్తిని కలిగి ఉంటుంది. అటువంటి అథినాయకుడి ప్రసంగం పూర్తి పాఠం బహిరంగ సభలో పాల్గొనే ప్రేక్షకులు మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ స్పష్టంగా వినపడాలి. కాబట్టి దయచేసి అథినాయకుడి ప్రసంగం అసాంతం ప్రశాంతంగా, నిశ్శబ్దంగా వినాలి అని మనవి. ఎటువంటి ఈలలు, కేకలు వేయకుండా సైనికులు మాదిరిగా పూర్తి క్రమశిక్షణతో ఉండాలని మరియు మీ చుట్టూ పక్కల ఉన్న అత్యుత్సాహం కలిగిన వారు ఏవరైనా అటువంటి చర్యలు చేసినప్పుడు, వీలైనంత వరకు వారికి నచ్చచెప్పి, సభ అసాంతంగా అధినాయకుడు పవన్ కళ్యాణ్ ప్రసంగపాఠం ప్రజలకు చేరేలా చూద్దాం.

ఈ బహిరంగ సభ ద్వారా పవన్ కళ్యాణ్ చేయబోయే ప్రసంగం మన రాష్ట్ర భవిష్యత్తుని పూర్తిగా మార్చబోయే అసాధారణమైన, చారిత్రాత్మకమైన, విప్లవాత్మకమైన మార్పుకి శ్రీకారం చుట్టే ప్రసంగం. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సభ అసాంతం సజావుగా సాగేలా, భవిష్యత్తు తరాల తలరాతకు శ్రీకారం చుడదామని విజ్ఞప్తి.