బుక్కూరు గ్రామంలో ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచారం

పాలకొండ: బుక్కూరు గ్రామంలో బుధవారం ఎన్డీఏ కూటమి బలపరిచిన జనసేన అభ్యర్థి “నిమ్మక జయకృష్ణ” ని గెలిపించవలసిందిగా మహాకూటమి నేతలు ఓటర్ మహా మహాశయులను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉపాధ్యక్షులు “గర్భాన సత్తిబాబు”, టీడీపీ నాయకురాలు జయకృష్ణ గారి సోదరి శ్రీమతి నిమ్మక మాధురి, తెలుగుదేశం పార్టీ పాలకొండ మండల అధ్యక్షులు గండి రామినాయుడు, తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు శ్రీమతి యోగిత గారు, పాలకొండ జనసేన నాయకులు మిడితాన ప్రసాద్, పెనుగొండ రాజశేఖర్, డొంక శివ ప్రసాద్, దోంపాక శివ, మాధాసి సంతోష్, జామి రాంబాబు, వారాడ గజేంద్ర నాయుడు. వీరఘట్టం జనసేన నాయకులు సతివాడ వెంకటరమణ, గర్భాపు నరేంద్ర మరియు, స్థానిక, జనసేన నాయకులు బిజెపి, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.