దొంగలలో రాజకీయ దొంగలు వేరయా..!!
మార్చి14వ తేదీన జరిగిన జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కొణిదెల నాగాబాబు ప్రజలని చైతన్య పరుస్తూ మామూలు దొంగలకు రాజకీయ దొంగలకు మద్య ఉన్న తేడాని చాలా చక్కగా వివరించారు. మామూలు దొంగలు వస్తువులు మాత్రమే దొంగతనం చేస్తారు, కానీ ఈ రాజకీయ దొంగలు ఉన్నారే వాళ్ళు ప్రజల జీవితాలను మరియు తర తరాల భవిష్యత్తుని కూడా నిలువు దోపిడి చేస్తారు అని చెప్పారు. రాజకీయ దొంగలని మనం ఓట్లు వేసి గెలిపించి మరీ తెచ్చుకుంటాం. అదే మామూలు దొంగ దొరికితే చావగోడతాము. ఈ రాజకీయ దొంగలను ఎదిరించి కనీసం ప్రశ్నించలేరు అని ఆయన ప్రజలకు హితవు పలుకుతూ ప్రజల్లో దైర్యం నింపారు. ప్రజలారా గమనించండి ఇప్పటికీ అయినా నిజం తెలుసుకోండి, ఎవరు ప్రజల తరుపున నిలబడి అలుపు ఎరుగని పోరాటాలు చేస్తున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎవరు ఎక్కువగా కష్టపడుతున్నారు అనే ఆలోచన చేయండి.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-15-at-6.24.18-PM.jpeg)