ప్రమాదవశాత్తు గాయపడిన వీరమహిళకు మనోధైర్యాన్నిచ్చిన పసుపులేటి పద్మావతి

అనంతపురం, జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ప్రమాదవశాత్తు గాయపడిన అనంతపురం జిల్లా, పెనుగొండ మండలం, 13 వ వార్డు కౌన్సిలర్ జనసేన అభ్యర్థి శ్రీదేవి ని పరామర్శించి, వారి యోగ క్షేమాలు తెలుసుకుని 5000 వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులు అందించిన రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యురాలు పసుపులేటి పద్మావతి. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు దేవరకొండ జయమ్మ, సురేష్ మరియు నార్పల తేజస్విని, అనంతపురం ప్రమీల, పెనుగొండ లోకేష్, వెంకటేష్ , అనిల్ మరియు కళ్యాణదుర్గం మమత, త్రివేణి, తార లు పాల్గొన్నారు.