కొయ్యలగూడెం పట్టణంలో 72 వ రోజు జనం కోసం జనసేన

పోలవరం, కొయ్యలగూడెం మండలం, కొయ్యలగూడెం పట్టణంలో 72 వ రోజు మండల అధ్యక్షులు తోట రవి ఆధ్వర్యంలో జనం కోసం జనసేన కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం ఇంచార్జి చిర్రి బాలరాజు ప్రతి ఇంటికి, ప్రతి షాప్ కి వెళ్లి అందర్నీ పలకరించుకంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ కొయ్యలగూడెం పట్టణంలో ప్రజలనుంచి మంచి స్పందన లభిస్తుంది. జనసేన పార్టీ తరుపున తాము చేసిన మంచి పనులు మరియు సత్యసాయి నీరు సంబందించిన ఉద్యమాలు ప్రజలలో చేరాయని మేము ఏమి చేసినా అది ప్రజల కోసమే అని ప్రజలు నమ్ముతున్నారని, అలాగే ఈ రాక్షస పాలనా మారాలి పోవాలి అంటే అది కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కే సాధ్యమన్నారు. జనసేన మేనిఫెస్టో అందరికి అందిస్తూ పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలు అందరికి తెలియచేయ్యయడం జరిగింది. 2024 లో పోలవరం నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరడం ఖాయంగా ప్రజలు భావిస్తున్నారన్నారు. కొయ్యలగూడెంని ప్రధాన పట్టణంగా తీర్చిదిద్దుతామ్మన్నారు. ఈ కార్యక్రమం పట్టణ అధ్యక్షులు మాదేపల్లి శ్రీను, ఉపాధ్యక్షులు మధు, కన్నయ్య, చోడిపిండి సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, వీరయ్య, బొలిశెట్టి శ్రీనివాస్, బొలిశెట్టి సూరిబాబు, జగ్గా రాజు, అప్పలరాజు, నక్క రాము, జనసైనికులు పాల్గొన్నారు.