పునః ప్రారంభoకానున్న ఆర్టీసీ సర్వీసులు

కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ తో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రోడ్డు రవాణా సర్వీసులు పూర్తిగా ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 4లో భాగంగా అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులను ప్రారంభించుకునేందుకు సడలింపులు ఇచ్చింది. దీంతో ఇప్పటికే పలు రాష్ట్రాలలో అంతర్ రాష్ట్ర రోడ్డు రవాణా సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ బస్సు సర్వీసులను ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. దీంతో గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన సిటీ సర్వీస్ బస్సులన్నీ మరోసారి రోడ్డెక్కనున్నట్లు తెలుస్తోంది. సిటీ బస్సు సర్వీసులను త్వరలో ప్రారంభించేందుకు టిఎస్ ఆర్టీసీ ప్రణాళికలు రచిస్తోందని సమాచారం అయితే ముందుగా ప్రయాణికులు అందరికీ 50% బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చి ఆ తర్వాత పరిస్థితులకు అనుగుణంగా ఏ ప్రాంతాలలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది అనే విషయాన్ని గ్రహించి ఆయా ప్రాంతాల్లో మరిన్ని బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రస్తుతం ప్రస్తుతం గ్రేటర్ ఆర్టీసీ సర్వీసులపై తెలంగాణ ఆర్టీసీ కసరత్తులు ప్రారంభించింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఈ నెలాఖరున సిటీ బస్సులు ప్రారంభమయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.