వైసీపీ నాయకులే కోనసీమ ఘటనలో ముఖ్య పాత్రధారులు: పితాని

రాజోలు: రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ శుక్రవారం రాజోలు నియోజకవర్గం గ్రామంలో ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ.. వైసీపీ నాయకులే కోనసీమ ఘటనలో ముఖ్య పాత్రధారులు అని మండిపడ్డారు. కోనసీమ వాసులంతా సంయమనం పాటించాలని.. ప్రశాంతంగా ఉండాలని కోరారు.