అగ్ని ప్రమాదానికి గురైన తోటలను పరిశిలించి, తహసీల్దార్ కి తెలియపరిచిన పేడాడ
ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం వావం పంచాయతీ ఉవ్వపేట గ్రామంలో నిన్న మధ్యాహ్నం వెంకటప్ప గణేష్, శ్యామ్ సుందర్ సాహు రైతుల యెక్క సుమారు 3 ఎకరాల చెరుకు తోట, అర ఎకరం నిమ్మతోట అగ్ని ప్రమాదం సంభవించింది. విషయం తెలుసుకున్న ఆమదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు కార్యకర్తలతో కలిసి చెరకు, నిమ్మ తోటలను పరిశీలించి స్థానిక తహసీల్దార్ కి తెలియపరిచి, ఆయా రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూర్జ మండలం కొల్లివలస ఎంపీటీసీ విక్రమ్, జైరాం, సంగం నాయుడు, మన్మధ, ఆసిరినాయుడు, ఢిల్లేశ్వరరావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-19-at-18.12.40-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-19-at-18.12.41-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-19-at-18.12.41-1024x576.jpeg)