జనసైనికుడి అకాల మృతికి జనసేన నాయకుల సంతాపం

వీరులపాడు నరసింహారావుపాలెం గ్రామంలో గత రెండు రోజుల క్రితం విధుల నిర్వహణలో ఉండగా తోట పుల్లారావు గుండెపోటుకు గురై మరణించారన్న వార్త వారి కుటుంబంతో పాటు మమ్మల్ని కూడా తీవ్ర ఆవేదనకు గురిచేసింది. పుల్లారావు వృత్తి చేసుకుంటూ కూడా జనసేన పార్టీకి ఎంతో అండగా నిలబడ్డారని, స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి విస్తృతంగా సేవలందించారని, వారు ఇలా అకాలమరణం చెందడం వారి కుటుంబానికి, పార్టీకి తీరని లోటు అని వారి కుటుంబానికి కృష్ణా జిల్లా పార్టీ నుండి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు. పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుందని తక్షణ సాయంగా రూపాయలు 15000/- వారి కుటుంబానికి అందజేశారు ఉమ్మడి కృష్ణా జిల్లా ఉపాధ్యక్షులు బోలియసేట్ఠి శ్రీకాంత్. కార్యక్రమంలో వీరులపాడు మండల పార్టీ అధ్యక్షులు బేతపూడి జయరాజు, కంచికచర్ల మండల పార్టీ అధ్యక్షులు నాయిని సతీష్, వీర మహిళలు జిల్లా ఉప కార్యదర్శి పుట్ట స్వరూప, తాటి విజయ, గోపిశెట్టి నాగలక్ష్మి, వేణు, ఏడుకొండలు, శింగంసెట్టి శ్రీనివాస్, రాజేష్ కుమ్మరి, షేక్ పెద్ద బాజీ, సూర్య తేజ బోయిన వేంకట స్వామి, పాల గోపాల కృష్ణ, పలువురు జనసైనికులు, 100 మంది కార్యకర్తలు హాజరై సంతాపాన్ని తెలియజేసారు.