అమర వీర నారికి నివాళి

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు శ్రీమతి మల్లు స్వరాజ్యం గారి మరణ వార్త చాలా ఆవేదన కలిగించిందని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలైన శ్రీమతి స్వరాజ్యం గారు తెలంగాణలోనే కాకుండా యావత్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆమె చూపిన ధైర్యసాహసాలు, పోరాట పటిమ అజరామరం. స్వరాజ్యం అన్న ఆమె పేరులోనే ఒక స్ఫూర్తి నిండి వుంటుంది. ఆమె మరణం ప్రజాస్వామ్యవాదులకు, పీడిత వర్గాలకు తీరని లోటు. ఆ అమర వీర నారికి నివాళులు అర్పిస్తూ అంజలి ఘటిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని జనసేనాని పేర్కొన్నారు.