తంబళ్ళపల్లె నియోజకవర్గ మండల కమిటీ సమావేశాలు
చిత్తూరు, జనసేన జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల మేరకు తంబళ్ళపల్లె నియోజకవర్గం 4 మండలాల కమిటీ సమీక్ష సమావేశం ఆదివారం పిటిఎన్ మండలం, ములకలచెరువు మండలం, తంబళ్లపల్లి మండలం మరియు పెద్దమండ్యం మండలాల అధ్యక్షులు మరియు మండల కమిటీ ఆధ్వర్యంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత అధ్యక్షతన మండల కమిటీ సమావేశాలు నిర్వహించడమైనది. ఈ సమావేశంలో గ్రామస్థాయి నుండి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు మరియు రాబోయే ఎన్నికలకు ఏవిధంగా పార్టీని బలోపేతం చేయాలి అనే అంశాల మీద మండల కమిటీ ఏ విధంగా పని చేయాలి అనే అంశాల మీద చర్చించడమైనది. మండలంలోని కమిటీ సభ్యులు అదేవిధంగా జనసైనికులు జనసేన నాయకులు నుండి అభిప్రాయ సేకరణ చేయడమైనది ఈ కార్యక్రమంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి, మండలాల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు మండల జనసేన నాయకులు మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-20-at-19.49.20.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-20-at-19.59.36-1024x469.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-20-at-19.49.18-1024x452.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/03/WhatsApp-Image-2022-03-20-at-19.48.40-1024x469.jpeg)