షహీద్ దివస్ సందర్భంగా మహనీయులకు అనంతపురం జనసేన ఘననివాళి

అనంతపురం, ప్రజల్లో స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని రగిలించేందుకు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పిన్న వయసులోనే ప్రాణత్యాగాలను చేసిన మహానీయులు “భగత్ సింగ్”, “రాజ్ గురు” మరియు “సుఖ్ దేవ్” ల స్ఫూర్తిని గుర్తుచేసుకుంటూ, షహీద్ దివస్ సందర్భంగా.. మహనీయుల అందరినీ స్మరించుకుని వారి స్ఫూర్తితో అనంతపురం నగరం నడిబొడ్డున మున్సిపాలిటీ ఆఫీస్ ఎదురుగా జెండా కట్ట దగ్గర ఎస్.ఎస్.బి.ఎన్ కాలేజీ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు, లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి విచ్చేసి ఘన నివాళులర్పించడం అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపిఎస్పి రాష్ట్ర అధ్యక్షులు ఆకుల రాఘవేంద్ర, ఎస్.ఎస్.బి.ఎన్ విద్యార్థులు అశోక్, నవీన్, సందీప్ రెడ్డి, వంశీ, అజయ్ కుమార్, బ్రహ్మానంద రెడ్డి మరియు కాలేజీ విద్యార్థులు, జనసేన నాయకులు పాలగిరి చరణ్ తేజ, ఎం.శ్రీనివాసులు నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.