వలస కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరిన జనసేనాని

*అగ్ని ప్రమాదంలో వలస కార్మికుల సజీవ దహనం బాధాకరం

సికింద్రాబాద్ లోయగూడ ప్రాంతంలోని టింబర్ డిపోలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కావడం నన్ను తీవ్రంగా కలచి వేసిందని, ఉపాధి కోసం బీహార్ నుంచి వలస వచ్చిన కూలీలు ఈ దుర్ఘటనలో మృత్యువు బారిన పడటం అత్యంత దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా తరఫున, జనసేన తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఈ కుటుంబాలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.