జనసేన ఆధ్వర్యంలో గూటాల ప్రీమియర్ లీగ్ విజేతలకు బహుమతుల ప్రదానం
పోలవరం నియోజకవర్గం, పోలవరం మండలం జనసేన పార్టీ కమిటీ నియోజకవర్గ ఇంచార్జ్ చిర్రి బాలరాజు ఆద్వర్యంలో, గూటాల గ్రామంలో ఆదివారం జరిగిన సమావేశంలో గూటాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ విజేతలను ప్రకటించడం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా జనసేన పార్టీ పోలవరం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ చిర్రి బాలరాజు మాట్లాడుతూ.. కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.. మండల గ్రామ కార్యకర్తలు అందరూ కలసికట్టుగా పనిచేయాలని, మండలాద్యక్షులకు సహకరించుకుంటూ.. పార్టీ విజయానికి కృషి చేయాలని వివరించారు.
గూటాల గ్రామంలో జరిగిన గూటాల ప్రీమియర్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ప్రధమ బహుమతి 22,222 చిర్రి బాలరాజు, ద్వితీయ బహుమతి 11,111 గుణపర్తి వీరవెంకట సత్యనారాయణ (చిన్ని) చేతులమీదుగా అందించడం జరిగింది. బహుమతులకు టోర్నీ ఆర్గనైజింగ్ మరియు ఆర్ధిక సహాయం ఆటపాకల వెంకటేశ్వరరావు (ఏ.వి)అందించారు. ఈ కార్యక్రమంలో చిర్రి బాలరాజు, గుణపర్తి చిన్ని పాదం నాగకృష్ణ, దుమారపు బాలయోగి, చీకట్ల సాయికృష్ణమూర్తి, కరిబండి గనిరాజు, కురసం రమేష్ రాము, వంశీ, ప్రసాద్, నాగేంద్ర, తోట మనోజ్కుమార్, నరేష్, మండల, గ్రామ కార్యకర్తలు బారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది.