బాబుజగ్జీవన్ రామ్ జయంతి సందర్బంగా నివాళులర్పించిన పితాని

ముమ్మిడివరం, రాష్ట్ర జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు ముమ్మిడివరం నియోజకవర్గ ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115వ జయంతి సందర్భంగా ముమ్మిడివరం పోలమ్మ చెరువగట్టున ఉన్న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలవేసి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు గుద్ధట జమ్మి, గోదాసి పుండరీష, జక్కంశెట్టి పండు, గొల్లకోటి వెంకటేశ్వరరావు, ఎలమంచలి బాలరాజు, గొల్లకోటి బుల్లి, గొల్లకోటి సాయిబాబు, కడలి వెంకటేశ్వరరావు, నరాలశెట్టి వెంకటేశ్వరరావు మరియు సవరపు వెంకట్ పాల్గొన్నారు.