శ్రీచైతన్య పాఠశాల ఉపాధ్యాయుల ఆందోళన..

ఈ రోజు మాదాపూర్‌లో గల శ్రీచైతన్యలో పనిచేసే ప్రైవేట్ ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. వీరికి మాజీ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మద్దతు తెలిపారు. శ్రీ చైతన్య విద్యాసంస్థలు అవలంబిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు లక్షల రూపాయల ఫీజులతో పాటు ఆన్‌లైన్ క్లాసుల పేరుతో డబ్బులు దండుకుంటున్నారు తప్ప విద్య సంస్థలో పని చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం ఎలాంటి జీతాలు చెల్లించడం లేదంటూ రామచంద్రరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక జీవోలు ఉన్నప్పటికీ ప్రభుత్వం అలసత్వం వహించడం సరికాదన్నారు. వెంటనే వారికి జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో 100 మంది ప్రైవేట్ ఉపాధ్యయులతో పాటు వివిధ సంఘాల నేతలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు.