జనసేన బలోపేతంకు కృషి

*జిల్లా కార్యవర్గ సమావేశం
*అధినేత పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక కృతజ్ఞతలు
*మండపేట ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ…

మండపేట, తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తామని మండపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ పేర్కొన్నారు. శనివారం రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరూ చేయని సాహసం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ మాత్రమే చేస్తున్నారని కొనియాడుతూ అధినేతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా లక్ష రూపాయలు ఇవ్వడానికి తన సంపాదనలో 5 కోట్లు విరాళం జనసేనపార్టీకు ప్రకటించడంతో రాష్ట్రంలో ఉన్న రైతాంగం అంత ఆయనకు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అధినేత తీసుకున్న నిర్ణయాన్ని జయప్రదం చేయాలని జనసైనికులు అందరూ పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అనంతరం ప్రభుత్వ వైఫల్యలపై జిల్లా కార్యవర్గానికి తగు సూచనలు ఇచ్చారు. అవసమైతే జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వుండే సమస్యలపై పోరాడటానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని ఆయన స్పష్టం చేశారు. జిల్లాలో జనసేన బలోపేతం చేసేందుకు అందరూ మరింత కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీ సభ్యులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, పార్టీ నాయకులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, మండలం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.