రాజానగరం జనసేన సమర శంఖారావం

*అడ్డగోలుగా పెంచిన విద్యత్ ఛార్జీలపై, అపక్రటిత కరెంటు కోతలపై రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన

రాజానగరం, వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో, రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పూర్తి సంక్షోభంలో నెట్టి,విద్యుత్ చార్జీలను అడ్డగోలుగా పెంచింది చాలక, రాత్రి పగలు అని తేడాలేకుండా అపక్రటిత పవర్ కట్ లు విధిస్తున్న తీరుకు, ప్రజలు అల్లాడిపోతుంటే, చోద్యం చూస్తున్న ఈ దుర్మార్గపు ప్రభుత్వుపు తీరుకు నిరసనగా అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు “పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలి” అనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 11 వ తేదీన, ఉదయం 9 గంటలకు, రాజానగరం గాంధీ బొమ్మ సెంటర్ నుండి ఎమ్మార్వో ఆఫీస్ వరకు “మహాధర్నా”(నిరసన) అనంతరం ఎమ్మార్వో కి వినతిపత్రం సమర్పణ కార్యక్రమం ఉంది. కావున రాజానగరం మండలంలోని(నియోజకవర్గం లోని) ప్రతీ గ్రామం నుండి నాయకులు, జనసైనికులు, వీర మహిళలు, వందలాదిగా తరలివచ్చి, ఈ మహాధర్నా కార్యక్రమాన్ని అత్యంత విజయవంతం చేయాలని రాజానగరం నియోజకవర్గ ఇంచార్జ్ మేడా గురుదత్ ప్రసాద్ మరియు జనసేన పార్టీ రాజానగరం మండల అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర కోరడం జరిగింది.