కసింవలసలో ఘనంగా జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ
ఆమదాలవలస, ఆమదాలవలస మున్సిపాలిటీ కసింవలసలో శనివారం స్థానిక జనసేన నాయకులు మధు, రాంబాబుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథులుగా జనసేనపార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్, శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జి కోరాడ సర్వేశ్వరావు పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జి గేదల చైతన్య హాజరయ్యారు. అనంతరం సుమారు 98 కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బూర్జ ఎంపిటిసి అభ్యర్థి ఆంపిలి విక్రమ్, కొత్తకోట నాగేంద్ర, గురుప్రసాద్, ఉదయ్, సరుబుజ్జిలి జడ్పీటిసి అభ్యర్థి పైడి మురళి మోహన్ మరియు స్థానిక జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-10-at-5.27.06-PM-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-10-at-5.27.06-PM-1-1024x461.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-10-at-5.27.07-PM-1-1024x768.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-10-at-5.27.07-PM-768x1024.jpeg)