మానవత్వం చాటుకున్న శ్రీమతి సుంకర కృష్ణవేణి

రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలైన క్షతగాత్రులను తన సొంతం వాహనంలో సకాలంలో ఆసుపత్రి కి తీసుకువచ్చి మెరుగైన వైద్యం అందేలా చూసారు…వివరాల్లోకి వెళితే జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుంకర కృష్ణవేణి , సుంకర శ్రీనివాస్ , మల్లిరెడ్డి బుచ్చిరాజు మానవత్వం చాటుకున్నారు. కాకినాడ నుండి పెద్దాపురం నియోజకవర్గం వెళ్తుండగా మార్గమధ్యలో సామర్లకోట ముత్యాలమ్మ తల్లి ఆలయం దగ్గరలో కాకినాడ నుండి సిరిపురం వెళ్లే వాహనం బైక్ రోడ్డు గుంతలో పడి రోడ్డుపై పడి గాయాలపాలయ్యారు, వారిని అటుగా వెళ్తున్న కృష్ణవేణి గారు చూసి వెంటనే కారు ఆపి తన కారులో దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకు రావడం జరిగింది. అక్కడి నుండి వారిని అంబులెన్స్ రప్పించి వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ప్రభుత్వ ఆసుపత్రి పంపించడం జరిగింది . సకాలంలో ఆసుపత్రికి చేర్చినందుకు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలుశ్రీమతి సుంకర కృష్ణవేణి మరియు జనసేన నాయకులకు క్షతగాత్రులు కృతజ్ఞతలు తెలిపారు.