ముత్తుకూరు జనసేన ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలంలో శనివారం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. భాగంగా ముత్తుకూరు మండలం బస్టాండ్ ఆనుకొని ఉన్న ఆటో స్టాండ్ వద్ద ప్లాస్టిక్ చెత్త, చెదారం అక్కడ వేయడం జరుగుతుంది దానివలన ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్నచిన్న వ్యాపారస్తులు అక్కడ బస్సు కోసం వేచి చేసే వాళ్ళు అందరు కూడా.. ఆ వాసనకి నిలబడలేని పరిస్థితి. ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సిబ్బంది ఎవరూ కూడా ఎత్తకపోవడంతో ఈ సమస్య జనసేన దృష్టికి రావడంతో.. జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ లో భాగంగా శనివారం అక్కడ ఉన్నటువంటి చెత్త మొత్తం క్లీన్ చేయడం జరిగింది. అయితే అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఎందుకని ఈ ప్లాస్టిక్ గాని, ఈ చెత్తను తొలగించే పరిస్థితులు ఎందుకు జరిపించడం లేదు? అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వ అధికారులను, అధికార పార్టీని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రహీం బాయ్, పవన్ వీరబాబు, సందీప్, శ్రీహరి, గిరీష్, రెహమాన్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.