సత్వరమే మత్స్యకారులకు జీవన భృతిని అందించండి: జనసేన డిమాండ్

మత్స్యకారులకు మత్స్య శాఖ అమలుచేసే సముద్రంలో చేపల వేట నిషేధం
ఏప్రిల్ 15వ తేదీనుండీ అమలులోకి రాగా.. నేటివరకు మత్స్యకారుల జాబితాను రూపొందించడంలో జరుగుతున్న తాత్సారం పై కాకినాడ సిటి జనసేన నగర అధ్యక్షులు సంగిసెట్టి అశోక్ మరియు పార్టీ నగర మత్సకార నాయకులు మడ్డు విజయ్ కుమార్ తదితర నాయకులు ఫిషరీస్ కార్యాలయంలో ఏ.డి ని కలిసి ఈ విషయంపై చర్చించారు.

అసలే కరోనా దెబ్బకి ప్రజల జీవితాలు అధోగతి పాలవ్వగా.. ముఖ్యంగా చేపల వేటే జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారుల పట్ల ఈ నిర్లక్ష్యం దారుణం అంటూ.. నిషేధం మొదలైన ఇన్నిరోజులైనా అర్హుల జాబితా రూపొందించకుండా వుంటే ఇంకెప్పుడు జీవన భృతి అందచేస్తారని ప్రశ్నించారు? సహాయం అందేదాకా పేద మత్స్యకారులు పస్తులు ఉండాలా, ఇదేమి న్యాయం అని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. దీనిపై సత్వరం చర్యలు చేపట్టి జీవన భృతి అందచేయకపోతే కాకినాడ సిటి జనసేన పార్టీ తరపున కాకినాడ సిటి అధ్యక్షులు సంగిసెట్టి అశోక్ పేద మత్సకారులకు న్యాయం జరిగేవరకూ ఆందోళనలు చేస్తామని తెలియజేశారు.