జనసేన వీరాభిమానికి ఆర్ధిక సహాయం అందించిన జక్కా రంగనాయకులు

కొమరోలు మండలం, కమ్మ వారి బజార్ వడ్డె మాని లక్ష్మీనారాయణ జనసేన వీరాభిమాని. ఇటీవల లక్ష్మీనారాయణకి యాక్సిడెంట్ అయిన కారణంగా అతనికి రెండు దవడలు ఫ్యాక్చర్ అయ్యి ఆరోగ్య పరంగానూ.. ఆర్థికంగానూ ఇబ్బంది పడుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ అభిమాని అయినటువంటి కంభం మండలం, మదార్ పల్లె గ్రామనివాసి మాజీ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి జక్కా రంగనాయకులు లక్ష్మీనారాయణకి 5000/ ఆర్థిక సహాయం అందజేస్తామని తెలిపి.. బాధితుని త్వరలో కలసి ఆర్థిక సహాయం చేస్తామని భరోసా ఇచ్చారు.