కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేనలో చేరిన ముస్లిం యువత

రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ముస్లిం మహిళలు, యువకులు పెద్ద ఎత్తున జనసేన పార్టీలో చేరిక వివిధ పార్టీలకు చెందిన దాదాపు 200 మంది ముస్లిం మహిళలు యువకులు శుక్రవారం జిల్లా అధ్యక్షులు రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు తమకు ఎంతగానో నచ్చాయని అదేవిధంగా కందుల దుర్గేష్ నాయకత్వంలో తమ సమస్యలు పరిష్కరించబడతాయని నమ్మకంతో గతంలో ఎమ్మెల్సిగా ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు మరియు చెరుకూరి రామారావు చేసిన అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరడం జరిగిందని ఆనందం వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు రాజమండ్రి రూరల్ మండల ఉపాధ్యక్షులు సలీం గారు మరియు కొంతమూరు గ్రామం ముస్లిం నాయకులు ఖాసీం భాషా వలి అస్సలామ్ నాగు సలీమ్ వారి ఆధ్వర్యంలో కళ్యాణ్ నగర్ కు చెందిన సుమారు 200 మంది తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి షేక్ అమీనా, తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి నారాయణ గౌడ్, మండల ఉపాధ్యక్షులు పట్టాభి మండల కార్యదర్శి పినమారెడ్డి దొరబాబు, కోలామూరు నాయకులు కర్రీ నాయుడు మరియు కొంతమూరు నాయకులు మొండ్రేటి ప్రసాద్, జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలు పాల్గొన్నారు.