కొడుకు శవాన్ని బైక్ పై తరలించిన కన్నతండ్రి..

కడప జిల్లా, రైల్వే కోడూరు నియోజక వర్గం, పెనగలూరు మండలం గిరిజన కులానీకి చెందిన కేశవ అనే 10 సంవత్సరాల బాలుడిని తిరుపతి రూయా హాస్పిటల్ లో లివర్ ప్రాబ్లమ్ తో చేర్చారు. గత రాత్రి ఆ బాలుడు మరణించగా ప్రైవేట్ అంబులెన్సు వాళ్ళతో కుమ్ముక్కై న ఉచిత అబులెన్సు వాళ్ళు రాకపోతే.. ప్రైవేట్ అంబులెన్సు వాళ్ళడిగిన డబ్బులు కట్టలేక దాదాపు 100 కిలోమీటర్లు ఆతండ్రి కొడుకు శవాన్ని బైక్ పై తీసుకెళ్లిన ఘటన నియోజకవర్గ పరిధిలోని ప్రజలని కన్నీటి పర్యంతం చేసినది. ఈ ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతోన్న ఈ ఘటనకు బాద్యులైన వారిని వెంటనే శిక్షించాలని జనసేన పార్టీ కోరుతుంది. భారత దేశంలో ఉన్నత వైద్యం అన్న వైద్య మంత్రి విడుదల రజని ఇప్పుడు ఏమంటారని, జగనన్న ప్రవేశపెట్టిన ఉచిత అంబులెన్సులు ఏమయ్యాయని జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ హత్యగా భావించి జనసేన పార్టీ నిరసన జేస్తున్నాం అని తెలిపారు. ఆ కుటుంబానికి సరైన న్యాయం చేయాలని రైల్వేకోడూరు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ని కోరడమైనది. ఈ కార్యక్రమంలో చవాకుల రెడ్డి మణి, సాయం విద్యాసాగర్, నల్లoశెట్టి కిషోర్, ఎదల అనంత రాయలు, మధు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.